
నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్లో, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఇండస్ట్రీకి పయ్యే చిరిచయమత్రం ‘జాతిరత్నాలు’. ఈ సినిమాతోనే అనుదీప్ దర్శకుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. తన డెబ్యూ సినిమాతోనే, ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాక, పలు చిత్రాలలో గెస్ట్ అప్యరెన్స్ కూడా ఇచ్చే అనుదీప్, తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి ఒక ఫంకీ సినిమా చేస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 13 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, ఈ సినిమాపై ప్రమోషన్స్ క్రమంలో అనుదీప్, విశ్వక్ సేన్, కయాదు లోహర్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
అంటర్వ్యూలో అనుదీప్ తన ప్రేమ మరియు పెళ్లి గురించి కూడా కామెంట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన మాట్లాడుతూ:
“నేను స్కూల్ డేస్లో ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అది వన్ సైడ్ లవ్. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. స్కూల్లో ప్రేమ చేసిన అమ్మాయికే నా మొదటి ప్రేమను చెప్పలేకపోయాను, కాబట్టి ఇక ప్రేమపై పెద్దగా ఆసక్తి లేను. కాలేజీలోనూ ఎవరినీ ఇష్టపడలేదు. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి పట్ల పెద్ద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు.”
ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు కొంత సందేహంతో, కొంత సరదాగా అనుదీప్ నిజంగానే పెళ్లి చేసుకోడంలేదా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఈ వ్యాఖ్యను జోక్గా చేసాడా అని ఆసక్తిగా అడుగుతున్నారు.
ఇంటర్వ్యూలో హీరోయిన్ కయాదు లోహర్ కూడా కొన్ని కామెంట్లు చేసి వైరల్ అయ్యారు. అనుదీప్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో విశ్వక్-కయాదు మధ్య రొమాంటిక్ సీన్లు చాలా ఉన్నాయి. కానీ కొన్ని సీన్లు చేయమని కయాదు మొండికేసింది” అని సరదాగా చెప్పగా, విశ్వక్ ఆ మాటలను హిందీలోకి అనువదించారు. దీంతో కయాదు చెప్పింది, “రొమాంటిక్ సీన్లలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ దర్శకుడికే అవి చేయడంలో తడబడిపోయాడు.”
Recent Random Post:















