
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా అపారమైన క్రేజ్ను పొందారు. ‘జైలర్’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించి, సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్, ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ను ప్రకటించారు. ‘జైలర్’ తర్వాత ‘వేట్టయాన్’ చిత్రంతో మరో విజయాన్ని అందుకుని, మంచి ఫామ్లో ఉన్నారు.
ప్రస్తుతం రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమాను చేస్తున్నారు. సౌత్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కు సంబంధం లేకుండా, స్టాండ్అలోన్ ఫిల్మ్గా రూపొందుతోంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ ‘కూలీ’ టీజర్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే టీజర్ను లాక్ చేసి, మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టీజర్తో పాటు విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసి, అదే రోజున ప్రకటించనున్నట్లు సమాచారం. టీజర్ కట్ను చూసి రజనీకాంత్ మరియు టీమ్ చాలా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. మార్చి 14న దర్శకుడు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ‘కూలీ’ నుంచి ఏదైనా విజువల్ కంటెంట్ను విడుదల చేయాలనే ఆలోచనతో టీజర్ను విడుదల చేయనున్నారని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని, గుమ్మడికాయ కొట్టడానికి సిద్ధమవుతోంది.
పూజా హెగ్డే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన ప్రత్యేక గీతంలో కనిపించనుండగా, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జునతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Recent Random Post:















