
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆదిపురుష్. ఆ సినిమా తర్వాత ముఖ్యంగా సౌత్లో, టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆయన తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. విజువల్స్ విషయంలో వచ్చిన భారీ నెగటివిటీతో ఓం రౌత్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ మేకర్ మళ్లీ తెలుగు హీరోల వైపు దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీలో హాట్ టాక్ నడుస్తోంది. ముంబై వర్గాల సమాచారం ప్రకారం, ఓం రౌత్ ఇటీవల ఓ యువ తెలుగు హీరోను కలిసి కథను నరేట్ చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ప్రస్తుతం ఓం రౌత్ అబ్దుల్ కలాం బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ధనుష్ లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మర్ ఈ సినిమాతో జతకావడంతో ప్రాజెక్ట్పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఇంతలోనే ఓం రౌత్ తెలుగు హీరోలను కలవడం వెనుక అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కోసమా? లేక కలాం బయోపిక్లో కీలక పాత్ర కోసమా? అన్న డిస్కషన్ మొదలైంది.
ఇంకో టాక్ ప్రకారం, ఓం రౌత్ ఒక పక్కా మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసి, అది కలాం బయోపిక్కు ఏమాత్రం సంబంధం లేని స్ట్రెయిట్ కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. ఆదిపురుష్ తో కోల్పోయిన ఇమేజ్ను ఒక సాలిడ్ హిట్తో తిరిగి తెచ్చుకోవాలనే లక్ష్యంతో, తెలుగు హీరోల మాస్ ఇమేజ్ను ఉపయోగించి పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగు హీరోలకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హింట్ దొరికినా బాలీవుడ్ మేకర్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఓం రౌత్ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆదిపురుష్ ప్రభావం వల్ల టాలీవుడ్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మారింది. కథలో నిజంగా దమ్ముంటే తప్ప, ఓం రౌత్కు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరో వెర్షన్ ప్రకారం, ధనుష్ హీరోగా చేస్తున్న అబ్దుల్ కలాం బయోపిక్లో ఒక కీలక పాత్ర కోసం తెలుగు హీరోను సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కలాం జీవితంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకదాన్ని మన నేటివిటీ ఉన్న నటుడు చేస్తే సినిమాకు మరింత రీచ్ వస్తుందని ఓం రౌత్ భావిస్తున్నారట.
ఏదేమైనా, ఈ సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఓం రౌత్ మళ్లీ సౌత్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆదిపురుష్ చేదు జ్ఞాపకాలను మరిచిపోయేలా ఒక బలమైన కంటెంట్తో వస్తే ప్రేక్షకులు మళ్లీ ఆదరించే అవకాశం ఉంది. మరి ఆ లక్కీ తెలుగు హీరో ఎవరు? ఓం రౌత్ వినిపించిన కథ ఏంటి? అన్న వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Recent Random Post:















