
‘ఏక్ నిరంజన్’ సినిమాతో ప్రభాస్ సరసన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తరచూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా, ఇప్పుడు ‘ఎమర్జెన్సీ’ అనే విభిన్నమైన సినిమాతో దర్శకురాలిగా మారింది.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, ఎన్నో అంచనాల మధ్య జనవరి 17న విడుదలై మిశ్రమ స్పందనను ఎదుర్కొన్నా, కంగన మాత్రం సినిమా పట్ల తన నమ్మకాన్ని ఎప్పటికప్పుడు చాటుతోంది. టైటిల్ రోల్లో నటించిన కంగనా, తన నటనకు మంచి ప్రశంసలు దక్కించుకుంది.
ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, ఓ అభిమాని నిత్యానందం కంగనా నటనపై ముచ్చటగా స్పందించారు. ‘ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ను ధైర్యంగా చూపించినందుకు అభినందనలు’ అంటూ ఓ లేఖ రాసిన ఆయన, తన అభిమానాన్ని చాటుతూ కంగనాకు ఓ విలువైన కాంచీపురం చీరను గిఫ్ట్గా పంపించారు.
ఈ విషయం మీద స్పందించిన కంగనా, తన ఇన్స్టాగ్రామ్ లో ఈ గిఫ్ట్ గురించి పోస్ట్ చేస్తూ, “ఎమర్జెన్సీ తీసినందుకు నాకు ఈ అద్భుతమైన శారీ గిఫ్ట్గా లభించింది. ఇది నాకిచ్చిన టచ్ చేసిన ట్రోఫీలకన్నా మెరుగైన బహుమతి” అంటూ రాసుకొచ్చింది. ఇది ద్వారా బాలీవుడ్లో ఇచ్చే అవార్డులపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా హృదయంగా గుర్తుచేసింది.
కంగనా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు బాలీవుడ్ అవార్డుల వ్యవస్థపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘అర్హత ఉన్నవారికి కాకుండా పరిచయాల వారికి అవార్డులు అందే పరిస్థితి ఉంది’ అంటూ నెపోటిజం అంశాన్ని ఎత్తిచూపింది.
Recent Random Post:















