
టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ హీరోగా మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ప్రధాన విలన్గా మలయాళ యువ నటుడు వెంకిటేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్లో అతని అటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అందరినీ ఆకట్టుకోగా, ఇటీవల జరిగిన ఈవెంట్లో చేసిన ప్రసంగం మరింతగా ఆకర్షణగా మారింది.
హైదరాబాద్లో జరిగిన కింగ్డమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వెంకిటేష్ ఉత్సాహంగా దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తెలుగు భాషలో ఆత్మవిశ్వాసంగా మాట్లాడిన తీరు అక్కడున్న వారిని మాత్రమే కాదు, ఆ వీడియో చూసిన నెటిజన్లను కూడా బాగా ఇంప్రెస్ చేసింది. హీరో విజయ్ దేవరకొండ కూడా వెంకిటేష్ను ప్రత్యేకంగా పొగడ్తలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ స్పీచ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో వెంకిటేష్ గురించి ఆసక్తి మరింత పెరిగింది.
సినిమాల్లోకి రాకముందు వెంకిటేష్ త్రివేండ్రంలో ఒక చిన్న రోడ్డుపక్క ఇడ్లీ షాప్ నడిపేవాడు. పెద్ద హోటల్ కాదు, నిలబడే స్థలం కూడా లేని చిన్న స్టాల్. కానీ అతని చేతుల మీదుగా చేసిన ఇడ్లీలు అక్కడి హాట్ ఫేవరెట్. ప్రతిరోజూ జనాలు క్యూ కట్టి ఆ ఇడ్లీల కోసం ఎదురుచూసేవారు. రీల్ వీడియోల వల్ల ఆ షాప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా అవకాశాలు వచ్చినా, గుర్తింపు రావడం మొదలైనప్పటికీ ఆయన తన ఇడ్లీ షాప్ను మాత్రం మూసేయలేదు. ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా స్వయంగా షాప్కి వెళ్లి కస్టమర్లకు ఇడ్లీలు సర్వ్ చేస్తుంటాడు. ఈ డౌన్ టూ ఎర్త్ నేచర్ నెటిజన్లను మెప్పిస్తోంది.
మలయాళంలో కొన్ని మంచి సినిమాలు చేసిన వెంకిటేష్కి, ఇప్పుడు కింగ్డమ్తో టాలీవుడ్లో పెద్ద గుర్తింపు రావాలని ఆశలు ఉన్నాయి. ట్రైలర్లోనే అతడి మురుగన్ విలన్ పాత్ర హైలైట్ అయింది. ఈ పాత్ర క్లిక్ అయితే మరిన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆయనకు అవకాశాలు రావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వ్యాపారం నుంచి, కష్టపడి, ఓ పెద్ద తెలుగు సినిమాలో విలన్గా మెరవడం వరకు వచ్చిన వెంకిటేష్ జీవితం నిజంగా చాలామందికి ప్రేరణగా నిలుస్తోంది. ఇప్పుడు సినిమా రిలీజ్తో పాటు, అతడి ఇడ్లీ షాప్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇక కింగ్డమ్ రిలీజ్ తర్వాత అతనికి ఎంత గుర్తింపు దక్కుతుందో చూడాలి.
Recent Random Post:














