
లేడీ పవర్ స్టార్గా అభిమానుల చేత ముద్దుగా పిలుచుకునే సాయి పల్లవి మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా హీరోయిన్ అంటే గ్లామర్, స్కిన్ షో అన్న భావన ఉన్నప్పటికీ, సాయి పల్లవి మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు పూర్తిగా క్లీన్ ఇమేజ్తో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల సాయి పల్లవి పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వ్యాపారవేత్తతో వివాహం, కుటుంబ ఒత్తిడి వంటి పుకార్లు వైరల్ కావడంతో ఈ విషయం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలపై తాజాగా సాయి పల్లవి స్పష్టత ఇచ్చింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా పుకార్లేనని ఆమె క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని సాయి పల్లవి స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమె షెడ్యూల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణంలో సీత పాత్రలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదే విధంగా విజయ్ సేతుపతితో ఒక సినిమా, అలాగే ఏక్ దిన్ అనే హిందీ ప్రాజెక్ట్లో కూడా సాయి పల్లవి నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. గ్లామర్కు దూరంగా ఉన్నప్పటికీ వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయి పల్లవి, ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్స్కు ఆదర్శంగా నిలుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post:















