రకుల్ ప్రీత్ – వల్లించేవి వేదాలు… చేసేవి మాత్రం…!

మన తాతల కాలం నుండి ఒక సామెత ఉంది. వల్లించేవి వేదాలు, చేసేవి మాత్రం ఏవో పనులు అని. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ను చూస్తే ఇదే సామెత గుర్తొస్తోంది నెటిజన్స్ కు. అందుకే ఆమెపై ఇప్పుడు ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం బోలెడన్ని ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుని చివరికి డ్రగ్స్ వద్ద వచ్చి ఆగింది.

ఇదే డ్రగ్స్ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె బ్రదర్ శోయిక్ చక్రవర్తి అరెస్టైన విషయం తెల్సిందే. నార్కోటిక్స్ అధికారులు మూడు రోజుల విచారణ అనంతరం ఆమె డ్రగ్స్ వాడుతోంది, డ్రగ్స్ పెడ్లర్స్ తో కాంటాక్ట్స్ ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడితో వ్యవహారం అయిపోలేదు. ఇంకా భీకరమైన టర్న్ తీసుకుంది. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఉంది ఇప్పుడు వ్యవహారం. రియా చక్రవర్తి ఇప్పుడు ఏకంగా 25 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించినట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. ప్రముఖంగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరు కూడా డ్రగ్స్ వాడినట్లు రియా నార్కోటిక్స్ అధికారులకు వెల్లడించింది.

కట్ చేస్తే 2017లో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు నో డ్రగ్స్ క్యాంపైన్ లో పాల్గొంది. ఇప్పుడు ఆ పోస్టర్ ను షేర్ చేస్తూ రకుల్ ప్రీత్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అసలు నిజాలు త్వరలో బయటకు రావాలని కోరుకుందాం.


Recent Random Post: