అటు ఫ్యామిలీ పరంగా, ఇటు సినీ వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని పుత్రోత్సాహాన్ని ఇస్తున్న హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరు వారసుడిగా పరిచయమై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్, ఇండియా వైడ్ చిరంజీవి తర్వాత మరో అరుదైన రికార్డ్ ని నెలకొల్పనున్నారు.
అదేమిటంటే ఇప్పటి వరకూ ఇండియాలో, దాదాపు 25 ఏళ్లుగా ఒక్క చిరంజీవి గారి మెగా అభిమానులు మాత్రమే ఆయన పుట్టిన రోజుకి ఒకరోజు ముందు వారం నుంచి వారోత్సవాలు చేసి, బర్త్ డే ఒక్క రోజు ముందు అనగా ఆగష్టు 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగా హీరోల సమక్షంలో మెగా అభిమానులతో కలిసి బర్త్ డే వేడుకల్ని నిర్వహిస్తారు. ఆ వేడుకలలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇండియా మొత్తం మీద ఏ హీరో అభిమానులు ఇలా చెయ్యరు.. ఇన్నేళ్ల ఇండియన్ సినీ చరిత్రలో ఆ ఘనత దక్కించుకున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి.
చిరు తర్వాత అదే రికార్డ్ ని ఇప్పుడు రామ్ చరణ్ ఖాతాలో కూడా చేరనుంది. ఈ ఏడాది నుంచీ మెగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్ని కూడా చిరు బర్త్ డే వేడుకలానే అంగరంగ వైభవంగా జరపడానికి సిద్ధమయ్యారు. మొదటి సారి జరగనున్న మెగా అభిమానుల రామ్ చరణ్ బర్త్ డే వేడుక మార్చి 26వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచీ హైదరాబాద్ శిల్పకళావేదికలో మొదలు కానుంది. ఇప్పటికే ఆల్ ఇండియా చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ శివ చెర్రీలు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ ని కలిసి ఈ వేడుక కోసం అధికారికంగా పర్మిషన్స్ తీసుకున్నారు.

ఈ వేడుక కోసం ఇప్పటికే మొదలైన సేవా కార్యక్రమాల గురించి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ శివ చెర్రీ పంచుకున్న పలు ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ మీ కోసం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ బర్త్ డే ఈవెంట్ డీటైల్స్:
1. మార్చ్ 21 నుంచి 27 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా మొక్కలు నాటడం, అన్నదానం, రక్తదానం, అనాధ పిల్లలకి నిత్యావసరాలను పంచడం, ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ మూవీ స్పెషల్ షోస్ ఇలా రోజుకో విధంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
2. లాక్ డౌన్ టైంలో చిరంజీవి గారి పిలుపుతో ఎంతో మంది ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేశారు. అన్ని రాష్టాల నుంచీ ఆ దాతలని స్పెషల్ గా తీసుకొచ్చి మెగా హీరోల చేత చరణ్ బర్త్ డే ఈవెంట్ లో సన్మానించనున్నారు.
3. లాక్ డౌన్ టైంలో ముందుండి ప్రజల కోసం తమ ప్రాణాలను అడ్డేసి నిలబడిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మెడికల్ టీం, పోలీస్ డిపార్ట్మెంట్, క్లీనింగ్ టీం, ఫుడ్ సప్లై ఇలా పలు విభాగాల్లో సేవలు అందించిన వారిలో సుమారు వందమందిని సన్మానించనున్నారు.
4. ఈ వేడుకలో పలు రాష్ట్రాల నుంచి పిలిపించిన టాలెంటెడ్ పీపుల్స్ తో పలు ఎంటర్టైన్మెంట్ స్పెషల్ షోస్ ని కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ ని డిజైన్ చేసిన స్పెషల్ డాన్స్ నెంబర్ హైలైట్ అవుతుందట.
5. మెగా అభిమానులు చేస్తున్న ఈ రామ్ చరణ్ గ్రాండ్ బర్త్ డే ఈవెంట్ కి చిరు వేసిన రాచబాటలో హీరోలైన మెగా హీరోలందరూ హాజరు కానున్నారు. ఒక వేళ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల చివరి నిమిషంలో రాలేకపోయినా ఈవెంట్ జరిగే టైం లో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అభిమానులతో మాట్లాడతారు.
6. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ మరియు శంకర్ డైరెక్షన్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇండియా వైడ్ ఒక్క రామ్ చరణ్ దాదాపు 1500 కోట్ల బిజినెస్ ఉన్న సినిమాలు చేస్తున్నాడనే విషయాన్ని ఇండియన్ సినీ లవర్స్ కి చేరవేయడం కూడా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి.
Elegant, Ravishing & Massive B'Day Common Motion Poster of #MegaPowerStar @AlwaysRamCharan garu from March 26th at 10 AM.
Stay Connected to @RcYuvaShakthi ?#SIDDHA#SeethaRAMaRajuCHARAN#HBDRamCharan#RastraRamCharanYuvashakthi pic.twitter.com/CtMh38HvBX
— SivaCherry (@sivacherry9) March 22, 2021











He commented that no one would dare to face Jagan in the near future after the results of the municipal elections and panchayat elections in the state.
Nani‘s much-acclaimed film ‘Jersey‘, which showcases the story of a cricketer, has won the best Telugu film and best editing award at the 67th National Film Awards.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన డ్రగ్స్ కేసుతో యంగ్ హీరో తనీష్ కు సంబంధం ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ కేసు విషయమై బెంగళూరుకు వచ్చి విచారణకు హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగిన నేపథ్యంలో మళ్లీ తనీష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అంటూ ఆయన సన్నిహితులు కూడా బాధ పడ్డారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆ డ్రగ్స్ కేసుకు తనీష్ కు అస్సలు సంబంధం లేదట. తనీష్ మరోసారి ఆ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను విడుదల చేశాడు.
Makkal Needhi Mayyam party president Kamal Hassan said that he is not afraid of IT raids and alleged that the BJP is trying to intimidate its opponents through the Central agencies.
Koratala Siva has been working on his ongoing project Acharya for well over three years. The filming of the Chiranjeevi starrer is often postponed and delayed due to various reasons.
If there is any film that many the audience laugh out loud in recent times, it is definitely ‘Jathi Ratnalu’. Featuring Naveen Polishetty, Rahul Ramakrishna and Priyadarshi in the lead, the film which released on 11th March got universal applause and turned into a blockbuster. The film made a pre-release business of 12 crores as per reports and it earned more than 30 crores till date. It crossed 1 million mark in the US market which is a huge feat post lockdown.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఫిట్మెంట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వబోతున్నామని.. ఏప్రిల్ 1 నుండి అమలులోకి రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ పద్దతిన పని చేస్తున్న వారికి కూడా ఈ ఫిట్మెంట్ ను ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యం ఈ ప్రకటన చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Young Tiger NTR is a star hero with a lot of craze. He is a talented actor who earned a lot of fans. He is currently acting Rajamouli’s ‘RRR’ which is in the last leg of its production. He will be seen as Komaram Bheem in this film and his fans are hoping that his stardom would reach a pan-Indian level with ‘RRR’. Hailing from a political family, many of his worshippers anticipate his entry into politics.
Renowned filmmaker Shankar had given us many memorable films in the past two decades. One of them is ‘Aparichitudu’ which was the biggest hit in Vikram’s career and the actor showed his tremendous acting skills in the character who suffers from split personalities. There are parodies and spoofs on that film even now.
ALGIERS: A court in Algeria issued arrest warrants Sunday for outspoken exiled activists, accusing a former diplomat, a blogger and a journalist of seeking to turn a protest movement to violence.
MOSCOW: The backer of Russia’s Sputnik V coronavirus vaccine said Monday it had signed an agreement with an India-based pharmaceuticals giant for the production of up to 200 million doses of the jab a year.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ప్రతి నియోజక వర్గంలో సీనియర్ నేతలు ముఖ్యనేతలు చక్కర్లు కొడుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న వ్యాఖ్యలు వాడి వేడీగా ఉంటున్నాయి. అన్నాడీఎంకే మరియు డీఎంకే నాయకుల మద్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత పై ఆమె మృతిపై డీఎంకే అధినేత స్టాలిన్ మరియు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ లు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We are aware that former AP Minister Bhuma Akhila Priya, her husband Bharghav Ram and brother Jagat Vikhyat Reddy, were charged for kidnapping a hockey player and some of their relatives.




