సుమంత్–కీర్తి విడాకులు తర్వాత కూడా స్నేహం కొనసాగింపు

Share


సెల‌బ్రిటీల ప్రేమ‌లు, పెళ్లిళ్లు, వారి గొడవ‌లు ఎల్లప్పుడూ జ‌నాలకి ఆసక్తికరంగా ఉంటాయి. సాధారణంగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు విడిపోయిన తర్వాత మళ్లీ సంబంధం కొనసాగించరు. కానీ కొంతమంది మాత్రం విడాకులు తీసుకున్నా మంచి స్నేహం కొనసాగిస్తారు. అందులో టాలీవుడ్ న‌టుడు సుమంత్ ఒక‌రు.

సుమంత్ 2004లో కీర్తి రెడ్డితో పెళ్లి చేసుకున్నారు. కానీ 2006లో వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు. అప్పటినుండి దాదాపు 20 ఏళ్లు గడిచినా, సుమంత్ మరియు కీర్తి ఇప్పటికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మమేకంగా ఉన్నారు.

ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా వెల్లడించారు. “ఇప్పటికీ తరచుగా కీర్తితో మాట్లాడుతుంటాను. ఆమె బెంగుళూరులో సెటిలై ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. పెళ్లికి ముందు నా సంబంధిత విషయాలన్నీ ఆమెతో పంచుకున్నాను” అని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి, సుమంత్ గర్ల్‌ఫ్రెండ్ లాంటి ఎవరూ లేరు, మళ్లీ పెళ్లి చేసుకోవాలనేది కూడా ఆలోచనలో లేదు. భవిష్యత్తులో ఆలోచన మారితే, మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తిని లైఫ్ పార్టనర్ గా తీసుకుంటానని అన్నారు. ఆయనకు టాటూలు, చెవులలో ఎక్కువ రింగ్స్ వంటి ఫ్యాషన్ ట్రెండ్స్ ఇష్టపడడం లేదు.


Recent Random Post: