
టాలీవుడ్లో పునర్జన్మ కాన్సెప్ట్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వ జన్మ తాలూకు జ్ఞాపకాలు, తిరిగి పుట్టిన తర్వాత వాటితో ముడిపడి సాగే కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. మూగ మనసులు నుండి మగధీర, మనం వరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఈ జానర్లో వచ్చాయి. అయితే ఇటీవల ఎవరూ ఈ కాన్సెప్ట్ను టచ్ చేయలేదు.
అయితే, తాజా లీక్ సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ – అట్లీ కలయికలో రాబోయే ప్యాన్ ఇండియా మూవీలో ఈ పునర్జన్మ ఎలిమెంట్ ఉండొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందుగా బన్నీ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ తాజా బజ్ ప్రకారం, అది ఒకే వ్యక్తి రెండు జన్మల్లో కనిపించే పాత్రగా ఉండనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్కి పీరియాడిక్ సెటప్ ఉండబోతున్నప్పటికీ, ఇది మగధీరలా రాజులు, యుద్ధాల నేపథ్యంలో కాకుండా, సగటు కమర్షియల్ బ్యాక్డ్రాప్లో అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో మలచిన కథగా ఉండబోతోందట. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. పుష్ప 2 తర్వాత వచ్చే భారీ సినిమా కావడంతో ఏ చిన్న విషయానికీ రాజీ పడట్లేదు. అట్లీ స్టైల్ మాస్ ఎంటర్టైనర్గా ఉండే ఈ సినిమా బడ్జెట్ ₹300 కోట్లకు పైగా ఉంటుందని టాక్. దీనిని సన్ పిక్చర్స్ – గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం.
అన్నీ కుదిరితే ఏప్రిల్ 8, బన్నీ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Recent Random Post:















