
గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల్లో హై రిస్క్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం స్టార్ హీరోలు బాడీ డబుల్స్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, ప్రమాదకరమైన స్టంట్స్ చేయడానికి వారు వెనుకడుగు వేస్తున్నారని నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల భారీ విజయాలు సాధించిన పలు సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబలి’లో నటిస్తూనే, లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘మైసా’లో టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు.
యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక గోండు తెగకు చెందిన శక్తివంతమైన మహిళ పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న ఓ సాహసం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దర్శకుడు రవీంద్ర పుల్లె వెల్లడించిన వివరాల ప్రకారం, కేరళలోని అతిరా జలపాతం వద్ద షూట్ చేసిన ఓ అత్యంత క్లిష్టమైన యాక్షన్ సీన్లో రష్మిక ఎలాంటి డూప్ లేకుండా పాల్గొన్నారు. 80 అడుగుల ఎత్తు నుంచి ఆమె స్వయంగా దూకినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం సమయంలో ఆమె చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయినప్పటికీ, షూటింగ్ను ఆపకుండా కొనసాగించడం టీమ్ను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు తెలిపారు.
సినిమా పట్ల, తన పాత్ర పట్ల ఆమె చూపిన నిబద్ధతను మొత్తం టీమ్ ప్రశంసించినప్పటికీ, ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ అవసరమా అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఇది రిస్క్ ఎక్కువైన చర్య అని అభిప్రాయపడుతున్నారు.
స్టార్ హీరోలు సైతం బాడీ డబుల్స్ను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో, రష్మిక స్వయంగా ఇలాంటి రిస్క్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఇలాంటి ప్రమాదకర సన్నివేశాల్లో మరింత జాగ్రత్త అవసరమని కొందరు సూచిస్తున్నారు.
Recent Random Post:















