
క్రికెటర్ యూజ్వేంద్ర చాహల్ మరియు కొరియోగ్రాఫర్ ధనశ్రీల విడాకుల విషయం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, కొద్దికాలానికే విడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. విడాకుల వ్యవహారం, భరణం వంటి అంశాలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారాయి. చాహల్ తన మాజీ భార్యకు 4.8 కోట్లు చెల్లించాడన్న వార్తలు కూడా వినిపించాయి.
ఈ విడాకులకు కారణంగా ఆర్జే మహ్వాష్తో ఉన్న స్నేహమేనని సోషల్ మీడియాలో ఓ వర్గం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ రూమర్స్పై మహ్వాష్ సీరియస్గా స్పందించినా కూడా, ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. సోషల్ మీడియాలో “ఇతరుల భర్తను దొంగిలించిన ఆర్జే” అంటూ కూడా వ్యంగ్యాలు చేస్తున్నారు.
ఇటీవల మహ్వాష్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోతో పాటు సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ ఈ పుకార్లకు సమాధానం ఇచ్చారు. “ఇది మోసానికి సరైన ఉదాహరణ. రిలేషన్షిప్లో ఇలాంటివి చేయడం మోసం. అలా చేసే వారిని వదిలేయండి. ఎవరి కర్మ వారిది. మీరు ఎందుకు నిరాశ చెందుతున్నారు? మోసం చేసే వాళ్లు ప్రతిరోజూ తమను నమ్మే వారినే మోసం చేస్తారు” అని ఆమె పేర్కొన్నారు. అలాగే తనకూ గతంలో ఇలాంటి అనుభవం ఎదురైందని, అలాంటి వారిని రెండోసారి క్షమించడం తప్పని చెప్పారు. “వారి కంటే మనమే మెరుగ్గా జీవించగలం” అని వ్యాఖ్యానించారు.
ఇంకా కోర్టు విడాకులు మంజూరు చేయకముందే చాహల్ ఆర్జే మహ్వాష్తో పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, ముఖ్యంగా క్రికెట్ స్టేడియంలో మరియు కొన్ని ఈవెంట్లలో ఇద్దరూ సన్నిహితంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల లండన్లో జరిగిన చాహల్ బర్త్డే వేడుకల్లో మహ్వాష్ ఆయనను హత్తుకున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే, ఇద్దరూ ఇప్పటికీ తమ సంబంధం గురించి అధికారికంగా ఏమీ చెప్పకుండా “మేము మంచి స్నేహితులమే” అని మాత్రమే చెబుతున్నారు.
Recent Random Post:















