దుబాయ్‌లో చిరు–బాబీ ఫుల్ స్క్రిప్ట్ చర్చలు.. నెక్స్ట్ మూవీకి క్లారిటీ దగ్గర!

Share


మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి సందడి చేస్తోంది. భోళా శంకర్ తర్వాత ఈ చిత్రంతో చిరంజీవి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు. ఈ సక్సెస్‌తో మెగాస్టార్ ప్రస్తుతం హ్యాపీ మోడ్‌లో ఉన్నారు.

ఇటీవల చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించిన మూవీ టీమ్‌తో పాటు, చిరంజీవి కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా చిరంజీవి దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ తన లైనప్‌లో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేసి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలో పూజా కార్యక్రమాలు జరుగుతాయనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి – బాబీ కొల్లి దుబాయ్‌లో ఫైనల్ స్క్రిప్ట్‌పై సీరియస్ చర్చలు జరుపుతున్నారట. మెగాస్టార్ ఇచ్చిన సూచనల మేరకు బాబీ మరియు ఆయన టీమ్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, చిరంజీవి సూచనతో సీనియర్ రచయిత కోన వెంకట్ కూడా స్క్రిప్ట్‌ను పర్యవేక్షిస్తున్నారట. మరో రోజులో స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కానుందన్న టాక్ వినిపిస్తోంది.

స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే ఫిబ్రవరిలో గ్రాండ్‌గా సినిమాను లాంఛ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ కోసం లొకేషన్స్ వెతుకుతున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం.

ఈ సినిమా కూతురు సెంటిమెంట్‌తో ముడిపడిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్నట్లు టాక్. చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఆస్కార్ అవార్డు విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం. అలాగే చిరంజీవికి కూతురిగా ఓ యంగ్ అప్‌కమింగ్ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశముందట. అంతేకాదు, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Recent Random Post: