ధర్మేంద్ర వేదనలో హేమమాలిని హృదయవిదారకం స్పందన

Share


లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ ఒక అతి పెద్ద లోటును అనుభవిస్తోంది. కోట్లాది అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఆయన ఇక లేరు అనే నిజాన్ని గ్రహించడం కష్టమే. ముఖ్యంగా ఆయన సతీమణి, నటి హేమమాలిని గారికి ఈ దుఃఖం మరింత లోతైనది. ఇన్నేళ్లు మౌనంగా ఆ వేదనను అనుభవించిన ఆమె, ఇటీవల సోషల్ మీడియా వేదిక ద్వారా భర్తను గుర్తుచేసుకుంటూ మొదటిసారి స్పందించారు.

వెండితెరపై ఎప్పుడూ evergreen జంటగా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర, హేమమాలిని నిజ జీవితంలో కూడా అంతే అన్యోన్యంగా గడిపారు. నవంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచినప్పటి నుంచి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ మౌనాన్ని వీడుతూ, ఆమె ట్విట్టర్ వేదికపై రాసిన ఎమోషనల్ లేఖ ఇప్పుడు అందరి గుండెలో మాధుర్యం రేకెత్తిస్తోంది.

హేమమాలిని తన పోస్ట్‌లో ఇలా అన్నారు:
“ధరమ్ జీ నాకు కేవలం భర్త మాత్రమే కాదు, మా ఇద్దరు బిడ్డలకు ప్రేమను పంచిన తండ్రి. అంతకుమించి, నా స్నేహితుడు, ఫిలాసఫర్, గైడ్, కవి కూడా. కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ నా వెన్నంటే నిలిచిన నా సర్వస్వం ఆయనే.”

అందులో, మంచిలోనూ చెడులోనూ ఆయన ఎల్లప్పుడూ తన తోడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఏంత పెద్ద స్టార్ అయినా, వ్యక్తిగతంగా చాలా సాధారణంగా ఉండేవని, ఆ మంచితనమే ఆయనను అందరికీ దగ్గర చేసినందని హేమమాలిని కొనియాడారు. ఆయన టాలెంట్, వినయం ఆయనను ఒక నిజమైన ఐకాన్ గా నిలబెట్టాయని, సాధించిన విజయాలు, కీర్తి శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేనిది, ఆ శూన్యం జీవితాంతం అలాగే ఉండిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల బంధం తర్వాత, ఇప్పుడు కేవలం జ్ఞాపకాలను మాత్రమే పట్టుకుని జీవించాల్సి రావడం దురదృష్టకరమని వాపోయారు. ఆవేదనలో ఆయనతో ఉన్న కొన్ని మధుర జ్ఞాపకాల ఫోటోలను కూడా షేర్ చేశారు. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఇలా జరగడం నిజంగా విధి విచిత్రం.

పవన్ హంస శ్మశాన వాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. భౌతికంగా దూరమైనా, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ హేమమాలిని గుండెలో ఉంటాయని ఆమె చెప్పారు. ఈ కష్టకాలంలో ఆమె ధైర్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Recent Random Post: