
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర సాంగ్ లాంచ్ కార్యక్రమం వైజాగ్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమం స్టార్ హీరో సినిమా ఈవెంట్ను తలపించింది. ఇంత పెద్ద స్థాయిలో జనాలు పాల్గొనడం ఆనందంగా ఉందని గుణశేఖర్ తెలిపారు. సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లిందని, ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్తో యుఫోరియాపై చర్చ మరింత పెరిగిందని, విడుదలకు మంచి ఓపెనింగ్ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటించగా, ఆమె పాత్రే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. తల్లి పాత్రలో భూమిక కనిపించే విధానం ఈతరం తల్లులకు ఒక నిదర్శనంగా ఉంటుందని తెలిపారు. మొదటి నుంచే ఈ సినిమాపై భూమిక ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక ముఖ్యమైన చిత్రం అవుతుందని ఆమె పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత గుణశేఖర్తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
యుఫోరియాలో భూమిక పాత్రను చూసిన తర్వాత, ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న తల్లులు తమ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలనిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
వైజాగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో భూమిక మాట్లాడుతూ…
“ఈ ఈవెంట్కు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా కెరీర్లో యుఫోరియా చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది నా టాప్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. పిల్లల తల్లిదండ్రులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మంచి ఆలోచనతో బయటకు వస్తారు” అన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్తో ఖుషి సినిమాలో కలిసి నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న భూమిక, “ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం గర్వంగా ఉంది. ఆయనతో కలిసి నటించిన జర్నీ నాకు ఎప్పటికీ స్పెషల్” అని అన్నారు.
భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించగా, రాగిణి గుణ సమర్పిస్తున్నారు.
రుద్రమదేవి, శాకుంతలం చిత్రాల తర్వాత గుణశేఖర్ ఒక సోషల్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. యుఫోరియా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తానని గుణశేఖర్ వెల్లడించగా, భూమిక కూడా ఈ సినిమా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత బిజీ అవుతారని చిత్ర వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
Recent Random Post:















