రీతూ వర్మ ‘మజాకా’ అనుభవాలు & భవిష్యత్ ప్రాజెక్టులు!

Share


టాలెంటెడ్ నటి రీతూ వ‌ర్మ ప్రస్తుతం ‘మ‌జాకా’ సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొంటూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ సినిమా కథ ఎంతో వినోదాత్మకంగా అనిపించిందని, స్టోరీ విన్నంత‌సేపు న‌వ్వుతూనే ఉన్నాన‌ని రీతూ పేర్కొంది. తన పాత్రకు సినిమాలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, ఈ సినిమా తనకు మరింత గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.

ఈ కథలో కేవలం వినోదం మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయని రీతూ చెప్పింది. సందీప్, తన లవ్ స్టోరీతో పాటు రావు రమేష్, అన్షు మధ్య ట్రాక్‌కు కూడా మంచి ప్రాధాన్యత ఉందని, తండ్రీ-కొడుకుల బంధం సినిమా మొత్తానికీ కీలకమైన ఎమోషనల్ కంటెంట్‌గా నిలుస్తుందని వెల్లడించింది.

మ‌జాకా‌లో తన పాత్ర కొత్త తరహాలో ఉండడం వల్ల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పిన రీతూ, సినిమా సెకండ్ హాఫ్‌లో రావు రమేష్‌తో కలిసి చేసిన సింగిల్ టేక్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ సీన్ తాను చాలా బాగా చేసినందుకు రావు రమేష్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారని, అది తన కెరీర్‌లో మర్చిపోలేని జ్ఞాపకమని తెలిపింది.

తన సినీ ప్రయాణంపై మాట్లాడిన రీతూ, అసలు తాను నటిగా మారతానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించింది. మంచి సినిమాల్లో భాగమవ్వడం ఆనందంగా ఉందని, ఇకపై మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

ఆద్యంతం యాక్షన్ బేస్డ్ రోల్స్ చేయాలనుందంటూ రీతూ తన ముచ్చట బయట పెట్టింది. కామెడీ జానర్ కూడా ఎంతో ఇష్టమని, అందుకే ‘మజాకా’ సినిమా ఒప్పుకున్నట్లు చెప్పింది. ఇక భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ఒక ఫుల్ లెంగ్త్ పీరియాడిక్ మూవీ చేయాలని ఎప్పటినుంచో కలలుకంటున్నానని తెలిపింది.

ప్రస్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు వెల్లడించిన రీతూ, ‘శ్రీకారం’ డైరెక్టర్ కిశోర్ దర్శకత్వంలో చేసిన ఓ వెబ్‌సిరీస్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి పెంచింది.


Recent Random Post: