“విలన్ పాత్రలకు గుడ్‌బై? ఎస్‌.జె. సూర్య కొత్త పేజ్”

Share


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి స్టార్‌డమ్ తెచ్చిన ఖుషీ సినిమాను మర్చిపోవడం కష్టం. తమిళ దర్శకుడు ఎస్‌.జె. సూర్య తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో విశేష విజయాన్ని సాధించి, ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. అనంతరం తాను హీరోగా నటించిన న్యూ వంటి సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన సూర్య, ఇటీవలి కాలంలో డైరెక్షన్‌కు తాత్కాలిక విరామం ఇచ్చి నటనవైపు అడుగులు వేశారు. ముఖ్యంగా విలన్ పాత్రల్లో నటిస్తూ స్పైడర్ సినిమాలో సైకో పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేశారు. తర్వాత మెర్సల్, మానాడు, రాయన్, సరిపోదా శనివారం, మార్క్ ఆంటోనీ, గేమ్ ఛేంజర్ వంటి సినిమాల్లో సూర్య చేసిన విలన్ క్యారెక్టర్లు సినిమాల హైలైట్‌గా నిలిచాయి.

అయితే ఇప్పుడు ఎస్‌.జె. సూర్య విలన్ పాత్రలకు గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇండియన్ 3, లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ, సర్దార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో విలన్‌గా కనిపించనున్నప్పటికీ, ఇవే చివరి విలన్ పాత్రలవవచ్చన్న ప్రచారం నడుస్తోంది. టాలీవుడ్‌ నుంచి వచ్చిన కొన్ని కీలకమైన విలన్ ఆఫర్లను కూడా ఆయన తిరస్కరించారట.

ఇందుకు కారణం—సూర్య మళ్లీ దర్శకుడిగా తన కెరీర్‌కి కొత్త ఆవిర్భావం ఇవ్వాలనుకుంటున్నాడట. ప్రస్తుతం కిల్లర్ అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. కోలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆయనకి దర్శకునిగా మరోసారి బ్రేక్ ఇవ్వనుందన్న నమ్మకం ఉంది.

అసలే తన విలన్ పాత్రలతో సినిమాలకు కొత్త లెవెల్ తీసుకెళ్లిన ఎస్‌.జె. సూర్య, ఈ తరహా క్యారెక్టర్లకు బ్రేక్ ఇవ్వాలనుకోవడం అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేస్తోంది. అయితే ఆయన దర్శకత్వం తీసుకుంటున్న కొత్త సినిమా ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: