
టాలీవుడ్లో కలల ప్రాజెక్ట్లుగా ప్లాన్ చేసే సినిమాలు కొన్ని సార్లు సమయానికి మొదలుకాకపోవడంతో మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఒక కథను వాయిదా వేస్తే, అదే కాన్సెప్ట్తో మరొక సినిమా వచ్చేసరికి, మొదటి ప్రాజెక్ట్పై ఉత్సాహం తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు హిరణ్యకశ్యప సినిమాకి ఎదురైనట్టుంది.
గుణశేఖర్, ‘రుద్రమదేవి’ తర్వాత మరింత భారీ స్థాయిలో హిరణ్యకశ్యప సినిమాను రానాతో చేయాలని, సురేష్ బాబును ఒప్పించి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా సాగలేదు. గుణశేఖర్ తరువాత ‘శాకుంతలం’ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ తిరిగి మొదలవుతుందని అందరూ భావించారు.
కానీ అనూహ్యంగా గుణశేఖర్ లేకుండానే, సురేష్ ప్రొడక్షన్స్ స్వతంత్రంగా ఈ సినిమాను చేయాలని నిర్ణయించి, గతేడాది త్రివిక్రమ్ కథతో ఈ ప్రాజెక్ట్ను తీసుకెళ్తామని ప్రకటించారు. కానీ ఆ అనౌన్స్మెంట్ తరువాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఇక తాజాగా వచ్చిన కన్నడ యానిమేటెడ్ మూవీ ‘మహావతార్: నరసింహ’ పరిస్థితిని మార్చేసింది. భక్త ప్రహ్లాద కథ ఆధారంగా తీసిన ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడు కీలక పాత్రగా చూపించారు. ఈ సినిమా కేవలం కన్నడలోనే కాదు, తెలుగు, హిందీ వెర్షన్లలో కూడా మంచి రెస్పాన్స్, కలెక్షన్స్ సాధిస్తోంది. ముఖ్యంగా యానిమేషన్లో హిరణ్యకశ్యపుడి డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ విజయంతో, ఇప్పటికే ప్రేక్షకులు చూసిన పాత్రపై మళ్లీ పూర్తి స్థాయి సినిమా తీస్తే అదే ప్రభావం రాదని భావిస్తూ, సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని నిర్ణయించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇలా మహావతార్ హిట్ కారణంగా హిరణ్యకశ్యప సినిమా భవిష్యత్తు అనుమానాస్పదంగా మారింది.
Recent Random Post:














