కేజీఎఫ్‌ స్టార్ యశ్‌ తల్లిపై మొత్తం గ్రామం పోలీసులకు ఫిర్యాదు

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న యశ్‌ కుటుంబం భూ వివాదంలో పోలీస్‌ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. గ్రామస్తులు పలువురు యశ్ తల్లి పుష్పలత పై ఫిర్యాదు చేశారు. 80 ఎకరాల భూమికి యశ్‌ కుటుంబ సభ్యులు కంచె వేసుకున్న నేపథ్యంలో ఈ వివాదం మొదలు అయ్యింది. ఆ వివాదం కాస్త పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లడంతో వివాదం మరింతగా ముదిరింది.

యశ్‌ తల్లి కర్ణాటక హాసన్‌ జిల్లా కు చెందిన వారు. ఆమెకు జిల్లాలో తిమ్మాపూర్‌ లో ఇల్లు ఉంది. ఇటీవలే ఆమె అక్కడ 80 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమికి కంచె వేస్తున్న సమయంలో గ్రామస్తులు అడ్డు పడ్డారు. కంచె వేస్తే మా పొలాలకు వెళ్లేందుకు వీలు పడటం లేదని, పూర్వ కాలం నుండి ఉన్న దారులను మూసి వేయడం వల్ల తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇరు వర్గాల వారిని పిలిచి మాట్లాడారు. యశ్‌ కూడా ఇప్పటికే తిమ్మాపూర్‌ కు వెళ్లాడు.


Recent Random Post: