100వ సినిమాలో నాగ్ అండ్‌ కొడుకులు

హీరోలకు ఎవరికి అయినా 100వ సినిమా అంటే చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేక సినిమాకు నాగార్జున కాస్త దూరంలో ఉన్నాడు. వచ్చే ఏడాది నాగార్జున వందవ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున వందవ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళంలో స్టార్‌ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న మోహన రాజా ప్రస్తుతం లూసీఫర్‌ ను చిరంజీవితో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. నాగ్‌ వందవ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది.

నాగార్జున వందవ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని అంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునతో పాటు ఈ సినిమాలో కొడుకులు కూడా కనిపించబోతున్నారట. అఖిల్‌ పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతుండగా చైతూ మాత్రం చిన్న పాత్రను మాత్రమే చేయబోతున్నాడు అంటూ ఉన్నారు. మోహనరాజా ఈమద్య కాలంలో కథను కూడా వినిపించారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు లూసీఫర్‌ ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. కనుక వచ్చే ఏడాది ఆరంభంలోనే నాగార్జున వందవ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది చివరి వరకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Recent Random Post: