డెలవరీ సమయంలో కరోనా.. హరితేజ బాధలు వర్ణనాతీతం

సాదారణంగానే కరోనా సోకిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది ఒక గర్బవతి కరోనా బారిన పడితే ఎలా పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బుల్లి తెర నటి యాంకర్ హరితేజ ఏకంగా డెలవరీకి వారం రోజుల సమయం ఉండగా కరోనా బారిన పడిందట. ఆ విషయాన్ని ఆమె తాజాగా వెళ్లడించింది. ఈ నెల ఆరంభంలో పాపకు జన్మనిచ్చిన హరితేజ ఆ సమయంలో తాను కరోనాతో బాధపడుతున్నట్లుగా చెప్పి ఆ రోజు సంఘటనలు తల్చుకుని ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియాలో.. నా డెలవరీకి వారం సమయం ఉండగా ఇంట్లో అంతా కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటీ అంటూ ఆందోళన పడ్డాను. రెగ్యులర్‌ గా చెకప్ కు వెళ్లిన చోట డెలవరీకి నో చెప్పారు. దాంతో కోవిడ్‌ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి నేను ఒక్కదాన్ని వెళ్లాను. నా కుటుంబ సభ్యులు అంతా కూడా కరోనాతో క్వారెంటైన్ లో ఉన్నారు. డెలవరీ అయిన వెంటనే నా పాపను దూరంగా తీసుకు వెళ్లారు. వీడియో కాల్‌ లో పాపను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హరితేజ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం పరిస్థితులు అత్యంత బాధకరంగా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె సూచించింది.


Recent Random Post: