పుష్పలో తన రోల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనసూయ

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన ముద్ర వేస్తూ ఉంటుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్ప చిత్రం తీస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనసూయ ఈ చిత్రంలో తన పాత్ర గురించి స్పందించింది. రంగస్థలం తర్వాత మరోసారి మెమొరబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ చిత్రంలో నా పాత్రకు మించిన రెస్పాన్స్ వస్తుంది.

సాధారణంగా సుకుమార్ గారు ఒకసారి పనిచేసిన వారితో మరోసారి చేయరని విన్నాను. కానీ నాతో మళ్ళీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది అనసూయ.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న పుష్ప చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.


Recent Random Post: