సుమ రాజీవ్‌ కొడుకు ఎంట్రీ మళ్లీ మళ్లీ… ఏం జరిగింది?

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన రాజీవ్ కనకాల మరియు సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా 2020 సంవత్సరం లో పరిచయం కాబోతున్నాడు అంటూ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే సుమ మరియు రాజీవ్‌ యొక్క తనయుడు తెరంగేట్రం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

మళ్ళీ కొత్తగా ఇప్పుడు విరించి వర్మ దర్శకత్వంలో సుమ తనయుడు హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా కు ప్రశాంత్ వర్మ కథ ను అందించబోతున్నారు అని కూడా సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ కథలు చాలా డిఫరెంట్గా ఉంటాయని ఇప్పటికే ఆయన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడంతో పాటు కథలను కూడా అందిస్తున్నాడు. ఈ సినిమా కు ఆయన కథ ను అందించడం తో కచ్చితంగా మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా సుమ రాజీవ్ తనయుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని చూడాలి.


Recent Random Post: