ఆ స్టార్ హీరోలో ప్లాప్ లు తెచ్చిన మార్పు ఇది!

ఖిలాడీ అక్షయ్ కుమార్ కి కొన్నాళ్లగా సరైన సక్సెస్ పడలేదు. వరుస గా సినిమా లైతే రిలీజ్ చేస్తున్నాడు గానీ బ్లాస్టింగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఉండటం లేదు. ‘ఆత్రంగిరే’ తర్వాత అన్ని పరాజయాలే ఎదురవు తున్నాయి. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’..’రక్షా బంధన్’..’కట్ పుటిల్లి’..’రామసేతు’..’సెల్పీ’ చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా కొట్టినవే. అన్ని భారీ నష్టాలు తెచ్చిన చిత్రాలే.

అయినా సరే ఖిలాడీ జోరు మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాల కు సైన్ చేయడం…వాటిని సెట్స్ తీసుకెళ్లే వేగం లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అక్షయ్ హీరో గా ఐదారు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే తాజాగా తన ప్లాప్ ల పరంపరని ఉద్దేశించి అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. సాధారణ విషయం ఎంటంటే సినిమాలు మంచి గా ఉన్నప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తారు.

కానీ అవి సరైన ఫలితాలు సాధించకపోతే అంతకు మించి విమర్శలు ఎదురవుతాయి. నేను మనిషిని. మంచి చెడు రెండింటి ని స్వీకరిస్తాను. ఈ సామర్ధం నాలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో నైనా ముందుకు సాగాల్సిందే. పని చేస్తూ ఉంటేనే ఫలితం దక్కుతుంది. నా సినిమాల హిట్లు ప్లాప్ లకు కొలమానం అన్నది బాక్సాఫీస్ లెక్కలు మాత్రమే. ప్రజజలు సినిమా చూడటానికి రాలేదంటే ఆ సినిమా వాళ్లకి అర్దం కాలేదని అర్ధం.

అంతకు మించి వంద రకాలుగా నేను ఆలోచించను. అలా చించినా ఎలాంటి ఉపయోగం లేదు. సినిమా ప్రేక్షకుల కు నచ్చిందే బాక్సాఫీస్ నిండుతుంది. నచ్చలేదంటే ఖాళీగా ఉంటుంది. అంతకు మించి ఇంకెలాంటి కారణాలు చెప్పను. ఇప్పుడు నేను మారాల్సిన సమయం కూడా ఇదే. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ప్రేక్షకులు నచ్చే సినిమాలు ..కథలు మాత్రమే ఎంచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి వరుస పరాజయాలు ఖిలాడీ లో చాలా మార్పులే తెచ్చినట్లు కనిపిస్తుంది.

 


Recent Random Post: