కర్ణాటకలో చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

కోవిడ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి తనవంతుగా సహాయం అందిస్తూ వస్తున్నాడు. ఆర్ధికంగా ఎంతో మందిని ఆదుకున్న చిరంజీవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ విషయంపై అందరూ సంతోషం వ్యక్తం చేసారు.

ఇదిలా ఉంటే చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పుడు కర్ణాటకలో ప్రారంభమైంది. కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఈరోజు ప్రారంభమైంది.

అఖిల భారత చిరంజీవి యువత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ ఆక్సిజన్ బ్యాంక్ లు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే సోను సూద్ కూడా ఆక్సిజన్ ప్లాంట్ లు నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.


Recent Random Post: