కరోనాతో మరో దర్శకుడు మృతి

కరోనా కరాళ నృత్యం కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా వల్ల పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. ఇద సమయంలో మృతులు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. తమిళ సినీ పరిశ్రమలో వరుసగా కరోనా తో మృతి చెందుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నటులు మరియు ఫిల్మ్‌ మేకర్స్ చనిపోగా మరో దర్శకుడు కరోనా వల్ల మృతి చెందాడు.

తమిళ దర్శకుడు దయాలన్‌ నిన్న కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన కరోనా కు చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడ్డ ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. ఈయన మురళి మరియు దేవయాని జంటగా నటించిన ‘కన్నుక్కు కన్నగా’ అనే సినిమాను తెరకెక్కించాడు. కేఎస్ రవికుమార్‌ వద్ద సుదీర్ఘ కాలం పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేశాడు.


Recent Random Post: