ప్యాన్ ఇండియా సినిమాతో రానున్న విశాల్

కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలను చేసే విశాల్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఎనిమి, సామాన్యుడు చిత్రాలతో బిజీగా ఉన్న విశాల్ ఈసారి ప్యాన్ ఇండియా సినిమాను మొదలుపెడుతున్నారు. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమాలు చెన్నైలోని ఒక సాయి బాబా గుడిలో జరిగాయి.

ఏ. వినోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఏకధాటిగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నాడు విశాల్.

ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగుతుందిట. సెకండ్ హాఫ్ లో మొత్తం 45 నిమిషాలపాటు యాక్షనే ఉంటుందని టీమ్ చెబుతోంది. ప్యాన్ ఇండియా వైజ్ గా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తారు. అన్ని భాషలకు కలిపి ఒకటే టైటిల్ ఉంటుందని వినికిడి.

ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్ గా సునైనా ఎంపికైంది. రీసెంట్ గా రాజరాజ చోరలో అందరినీ ఇంప్రెస్ చేసింది ఈ భామ.


Recent Random Post: