కేజీఎఫ్‌ హీరో గూండాగిరిపై కలెక్టర్‌ కు ఫిర్యాదు

కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న కన్నడ హీరో యశ్‌ త్వరలో కేజీఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమయంలో ఆయన కేజీఎఫ్‌ 2 సినిమా పబ్లిసిటీతో మీడియా ముందుకు రావాల్సింది పోయి ఒక భూ వివాదం కారణంగా మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవల ఆయన తల్లి సొంత గ్రామంలో కొనుగోలు చేసిన భూమి వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ఆమె కొనుగోలు చేసిన 80 ఎకరాల భూమికి కంచె వేసుకునే విషయమై గ్రామస్తులకు ఆమెకు గొడవ మొదలు అయ్యింది.

ఆమె తన భూమికి కంచె వేసుకున్నట్లయ్యితే గ్రామస్తులు తమ పొలాలకు వెళ్లడం కుదరడం లేదు. దాంతో వారు అడ్డుకుంటున్నారు. ఆ వివాదం యశ్‌ కుటుంబం మరియు గ్రామస్తుల మద్య పెద్దది అయ్యింది. గ్రామస్తులను యశ్‌ రౌడీలను పెట్టి మరీ బెదిరిస్తున్నాడు అంటూ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న జిల్లా కలెక్టర్‌ యశ్‌ ను విచారించేందుకు సిద్దం అవుతున్నారు. బెదిరించినట్లుగా వెళ్లడి అయితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. యశ్‌ చుట్టు కొందరు కావాలని ఈ వివాదాలను సృష్టిస్తున్నారు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: