సామాజిక కార్యక్రమాల కోసం కదిలిన రామ్ చరణ్, మహేష్

సామాజిక కార్యక్రమాల కోసం మన తెలుగు తారలు కదలివస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులు సామాజిక పనులకు పూనుకుంటున్నారు. మహేష్ హెల్మెట్ ధరించమని చెబుతున్నాడు. ఆయన హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తోన్న ఫోటోను సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ గా తెలంగాణ స్టేట్ పోలీస్ షేర్ చేసారు. మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం భరత్ అనే నేను చిత్రంలోని స్టిల్ ను ఈ సందర్భంగా ఉపయోగించుకున్నారు.

మీకు, మీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు హెల్మెట్ ధరించండి అని తెలంగాణ స్టేట్ పోలీస్ ట్విట్టర్ లో తెలిపారు. మరోవైపు సైబరాబాద్ పోలీసుల కోసం రామ్ చరణ్ వస్తున్నారు. 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 జరుగుతోంది. సైబరాబాద్ పోలీసులు నిర్వహించే ఈ మీట్ కు ముఖ్య అతిధిగా రామ్ చరణ్ విచ్చేయనున్నారు. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ జరగనుంది. గౌరవ అతిథిగా ఉపాసన కూడా వస్తుండడం విశేషం.


Recent Random Post: