సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి సినిమాను కూడా లాక్ చేసేశాడు. అది కూడా ‘‘లవ్ స్టోరీ’’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారు.సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటున్నారు.
లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కరోనా క్రైసిస్ లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డిసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనం అని చెప్పుకోవాలి.లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.
శేకర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తారు.










మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న కొన్ని ట్వీట్స్ వివాదాస్పదమవుతున్నాయి. మహత్మా గాంధీని చంపిన నాధూరామ్ గాడ్సే కూడా దేశభక్తుడే అని చేసిన ట్వీట్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఆ ట్వీట్ పై మంటలు చల్లారకముందే నాగబాబు చేసిన మరో ట్వీట్ వివాదాస్పదం అవుతోంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తే వారి డిక్షన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ దగ్గరనుండి ప్రతీదీ మార్చేస్తాడు దర్శకుడు. ముఖ్యంగా హీరోలను సరికొత్త మాస్ యాంగిల్ లో చూపించమంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా.
తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని స్వగృహంలో రాత్రి నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్ హఠాత్తుగా మరణించాడని, ఉదయం చూసుకున్న ఇంటి సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకున్న అభినయ్ కి ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను తెరకెక్కించారు. కెరీర్లో నాటి ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, నేటి జనరేషన్ లో అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసారు. అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా పరిచయం చేసాడు. అలాగే అతిలోక సుందరి శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సి లాంటి ఎందరో హీరోయిన్స్ ని కూడా ఆయన తెలుగు సినిమాకి పరిచయం చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోస్ తో కూడా డిఫరెంట్ సినిమాలు చేసి వారి కెరీర్ కి పూల బాట వేశారు.
On Wednesday, he disclosed that he had Managed to provide a couple of buses that would take these abandoned migrants back to home. The two transports left from Hyderabad conveying 56 vagrants who had been abandoned jobless in Hyderabad for more than two months. The transport was all set to to travel toward Srikakulam.
Rana Daggubati one of the most eligible bachelors in Telugu film industry is going to tie knot very soon. He has recently revealed that he is going to marry Miheeka Bajaj very soon. The other day, engagement too happened without much noise, following government guidelines. However many have no idea, who is Miheeka Bajaj and how their love story started etc.,








