ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మే నెలలోనే అందుకు ముహూర్తం!

‘బాహుబలి’తో నేషనల్ స్టార్గా గుర్తింపు పొందిన టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్.. ఇటీవల ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వింటేజ్ ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం మార్చి 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ చాప్టర్ 1తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కౄరమైన విలన్ పాత్రలో అలరించబోతున్నారు. హాంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది.

అయితే చాలా కాలంగా ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో అభిమానులు చిత్ర టీమ్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే సలార్ మూవీ టీజర్ను ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ విడుదల రోజే రిలీజ్ చేయబోతున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ శుభవార్త కూడా చెప్పారు.

ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ‘సలార్’ గురించి ప్రస్తావించారు. సరికొత్త కథతో సలార్ ను రూపొందిస్తున్నామని ఇందులో ప్రభాస్ ఓ డిఫరెంట్ పాత్రలో మిస్మరైజ్ చేయనున్నాడని ప్రశాంత్ నీల్ తెలిపారు.

అలాగే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మే నెలలో రిలీజ్ చేయనున్నామని అందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా అనౌన్స్ చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కాగా ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఈయన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్-కె’ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని టాక్ ఉంది.


Recent Random Post: