రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో మెగాస్టార్..?

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన రాజమౌళి.. భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెరకెక్కించాలంటే ‘బాహుబలి’ కంటే పదింతలు ఎక్కువగా కష్టపడాలని.. 10 ఏళ్ళ సమయం పడుతుందని రాజమౌళి చెబుతుంటారు. అయితే రాబోయే మూడేళ్ళలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రాజమౌళి ఓ సినిమా చేయనున్నారు. ఈ క్రమంలో ‘మహాభారత’ ఘట్టాన్ని ఓ రేంజ్ లో తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. చిత్రీకరణకు ఎక్కువ టైమ్ తీసుకోకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీని వాడుకొని ఈ సినిమాను తీయాలనే ఆలోచన చేస్తున్నారట.

ఇందులో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందర్ని తీసుకోవడానికి జక్కన్న స్కెచ్ వేస్తున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఓ పాత్రని చేయించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘సైరా’ వంటి చారిత్రాత్మక సినిమాలో కూడా నటించారు. ఈ క్రమంలో జక్కన్న ‘మహాభారతం’ లో చిరు నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చిరు తనయుడు రామ్ చరణ్ తో రాజమౌళి ఇప్పటివరకు ‘మగధీర’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవితో కూడా సినిమా చేస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.


Recent Random Post: