విశ్వక్ సేన్ తో జోడి కట్టనున్న రకుల్ ప్రీత్

ఇప్పటికే టాలీవుడ్ లో డిజిటల్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగులో మరిన్ని వెబ్ సిరీస్ లు, యాంథోలోజి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే కథానాయికలు తమన్నా, కాజల్, సమంత, వంటి వారు వెబ్ సిరీస్ లు చేసారు. ఈ రంగంలోకి కొంచెం లేటుగా ఎంట్రీ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

దర్శకుడు ఏఎల్ విజయ్ తైలవి వంటి భారీ సినిమా తర్వాత లేడీస్ నైట్ పేరుతో ఒక యాంథోలోజి సినిమా చేస్తున్నాడు. హాలోయిన్ పార్టీ జరిగిన తర్వాత ఎదుర్కొనే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ వెబ్ సినిమా నడుస్తుంది.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక కాగా నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, విద్యుల్లేఖ, మేఘా ఆకాష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Recent Random Post: