అఖండ-2: బాలయ్య, బోయపాటి మాస్ కాంబోపై భారీ అంచనాలు!

Share


టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ-2 తాండవం రూపొందుతున్న విషయం తెలిసిందే. అఖండ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం అయినందున, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.

ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్ వీడియో ఘనమైన స్పందన అందుకుంది. అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా, మరింత మాస్ అప్పీల్‌తో ఈ సీక్వెల్ రాబోతోందని స్పష్టమైంది. షూటింగ్ వేగంగా జరుగుతుండగా, పలు రూమర్లు, లీక్‌ updates మూవీపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తుండగా, తాజాగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు ఖరారైంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, అఖండ-2 గురించి స్పందించారు.

“ఇప్పుడే సినిమా గురించి చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాలయ్య గారు, బోయపాటి గారి కాంబో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు—ఫుల్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ! ప్రస్తుత షెడ్యూల్ చాలా ఎగ్జైటింగ్‌గా సాగుతోంది. బాలయ్యతో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి,” అని ఆది పినిశెట్టి వెల్లడించారు.

అంతేకాదు, “చిన్నప్పుడు బంగారు బుల్లోడు మూవీ సమయంలో డాడీ (రవి రాజా పినిశెట్టి)తో కలిసి సెట్స్‌కి వెళ్లినప్పుడు బాలయ్యను కలిశాను. ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం స్పెషల్ ఫీలింగ్. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది” అని తెలిపారు.

ఆది పినిశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖండ-2 సినిమా మరింత భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో, ఈసారి అంచనాలను మించే రేంజ్‌లో సీక్వెల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


Recent Random Post: