
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్లో కొత్త ప్రయోగాలు చేస్తూ ఫ్యాన్స్ను ఆలోచింపజేస్తున్నారు. తాజాగా కుబేర సినిమాలో హీరోగా కాకుండా కీలక పాత్రలో కనిపించడం, అలాగే లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న కూలీ చిత్రంలో విలన్గా నటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేరలో నాగ్ హీరోగా కాకుండా క్యారెక్టర్ రోల్ తీసుకోవడం వెనుక వ్యూహమే ఉందని భావిస్తున్నారు. ఇక కూలీ సినిమాలో సైమన్ అనే భీకర విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర నాగార్జున నుంచి ఊహించని షాక్ అని చెప్పొచ్చు.
ఇలాంటి ప్రయోగాలు నాగార్జున కెరీర్కు ముప్పేమా అన్న భయంతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నా, ఆయన చేస్తున్నది ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ అని ఇండస్ట్రీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కథ, పాత్ర బలంగా ఉంటే, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అన్న దానిపైే నాగార్జున ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమలో సీనియర్ హీరోగా ఉన్నా, ఇప్పటికీ విలువైన పాత్రలు ఎంచుకోవడంలో నాగార్జునకు స్వేచ్ఛ ఉంది. నిర్మాతలు కూడా నాగార్జున కోసం ప్రత్యేక కథలు తయారుచేసేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి తాను చేసిన ప్రయోగాలు భవిష్యత్తు కెరీర్పై ప్రభావం చూపే అవకాశం తక్కువ.
ఇదంతా చూసితే, కుబేర, కూలీ లాంటి చిత్రాలు నాగార్జున అభిమానులకు ఒక సంకేతం — “నేను వెర్షటైల్ యాక్టర్ ని, హీరో కాకపోయినా, పాత్రే ప్రధానమైతే నేనందులో నటించేందుకు సిద్ధం” అని చెబుతున్నారు.
మోహన్లాల్, మమ్ముట్టి లాంటి మలయాళ లెజెండ్స్ చేస్తున్న విధానంలోనే నాగార్జున కూడా సొంత దారిలో ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ హీరోగా ట్రెండ్స్ మార్చే దిశగా సాగుతున్న ఆయన ఈ ప్రయోగాల ద్వారా తనకు తగ్గ పాత్రలే ఎంచుకుంటూ, మరోసారి తన రేంజ్ ఏంటో నిరూపించడానికి సిద్ధమవుతున్నారు.
Recent Random Post:















