సాగరకన్య రెస్టారెంట్ లాంచ్ .. స్టార్ల హంగామా అక్కడేనా?


సాగరకన్య శిల్పా శెట్టి `బాంబే డైయింగ్` రాజ్ కుంద్రాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వారసులు ఉన్నారు. భార్యాభర్తలు ఐపీఎల్ ఫ్రాంఛైజీ వోనర్లుగానూ సుపరిచితులు. వ్యాపారరంగంలో ఈ ఫ్యామిలీ స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఏది చేపట్టినా సక్సెస్సే.

ప్రస్తుతం శిల్పాజీ రెస్టారెంట్ బిజినెస్ విస్తరణ పనిలో ఉన్నారు. సొంత రెస్టారెంట్ `బాస్టియన్` ముంబై వర్లి బ్రాంచ్ ప్రారంభమవుతోంది. ఇప్పటికే రెడీ అయిన బ్రాంచీకి సంబంధించిన అనేక కొత్త ఫోటోల్ని శిల్పాశెట్టి తాజాగా షేర్ చేశారు. ఈ రెస్టారెంట్ లో శిల్పా 50 శాతం వాటాదారుగా ఉన్నారు. కొత్త అవుట్ లెట్ నుండి చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

‘త్వరలో వస్తోంది.. థాంక్యూ` అనే హ్యాష్ ట్యాగ్ లను ఈ ఫోటోలకు జోడించారు శిల్పా. నల్లని దుస్తులను ధరించి ఆమె రెస్టారెంట్ ఈవెంట్లో కనిపించింది. వేరొక ఫోటోలో భర్త రాజ్ కుంద్రా.. రితీష్ దేశ్ ముఖ్- జెనెలియా డిసౌజా జంట ఉన్నారు. శిల్పా ఈ పోస్ట్ కు ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. “ 9 నెలల్లో విందు కు రెడీ కండి. బాస్టియన్ ముంబై వోర్లిలో మంచి ఆహారాన్ని అందిస్తుంది. స్నేహితులతో రుచి చూసే రాత్రి కోసం వేచి చూడండి” అంటూ వ్యాఖ్యను జోడించారు.

శిల్పా సోదరి షమితా శెట్టి .. నటి సోఫీ చౌదరి గుండె ఎమోజీలతో విషెస్ తెలిపారు. అలాగే గ్రూప్ సెల్ఫీ తో జెనెలియా ఇన్ స్టా ప్రచారం చేసారు. ముంబైలో బాస్టియన్ సుందరమైన ప్రదేశం.. చక్కని రుచికరమైన ఆహారం లభిస్తుంది అంటూ సెలబ్రిటీలు ప్రచారం చేయడం ఆసక్తికరం.


Recent Random Post: