
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్ వైపు కూడా నేరుగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ Allu Arjun తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పుష్ప సినిమాతో నార్త్ బెల్ట్లో భారీ క్రేజ్ సంపాదించిన ఆయన, ఆ ఇమేజ్ను మరింత బలపరచుకోవడానికి ముంబైని తన రెండో బేస్గా మార్చుకుంటున్నారని సమాచారం.
గతంలో చాలా మంది హీరోలు హిందీ ప్రాజెక్టుల కోసం తాత్కాలికంగా ముంబై వెళ్లి వచ్చేవారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అక్కడే స్థిరమైన బేస్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తుండటం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, ముంబైలోని జుహు తారా రోడ్లో సముద్ర దృశ్యం ఉన్న ఒక లగ్జరీ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్ను ఆయన
అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. దీనికి నెలకు సుమారు 16 లక్షల రూపాయల వరకు అద్దె చెల్లిస్తున్నారని టాక్. ఇది కేవలం నివాసం కోసం మాత్రమే కాకుండా, వ్యూహాత్మకంగా తీసుకున్న అడుగు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ముంబైలో ఉండటం వల్ల బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్లతో నిరంతర సంబంధాలు కొనసాగించడం సులభమవుతుంది. కొత్త ప్రాజెక్టుల చర్చలు, పెద్ద డీల్స్ వంటి విషయాల్లో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేసే ప్రయత్నంలో ఇది కీలకమైన స్టెప్గా చెప్పబడుతోంది.
భవిష్యత్తులో అట్లీ, లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకులతో చేయబోయే సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముంబై నుంచే జరుగే అవకాశం ఉందని సమాచారం.
వ్యక్తిగత జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న అల్లు అర్జున్, కుటుంబానికి కూడా ఈ కొత్త సెటప్ ఉపయోగపడేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి సమయం గడపడానికి ఈ ఇంటిని అనుకూలంగా డిజైన్ చేయించుకున్నారని టాక్. సుమారు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ హోమ్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి, అల్లు అర్జున్ ముంబై షిఫ్టింగ్ టాలీవుడ్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ అడుగు ఆయన కెరీర్ను బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ముంబై బేస్ నుంచి ఆయన ఎలాంటి భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారో చూడాలి.
Recent Random Post:















