‘టర్కిష్ తర్కం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి అమీనా నిజమ్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది.
రీసెంట్గా కశ్మీర్లోని పహల్గామ్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అమీనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ, “ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలను చంపడంపై తాను సిగ్గు పడుతున్నాను” అంటూ రాసింది.
ఈ వ్యాఖ్యపై నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెను దేశ వ్యతిరేకిగా అభివర్ణించారు. “శాంతి పాఠాలు చెప్పడం మంచిదే కానీ, అదే ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని మర్చిపోకూడదు” అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.
కొంతమంది నెటిజన్లు మరింత ముందుకెళ్లి, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారికి సినిమా అవకాశాలు ఇవ్వకూడదు అంటూ ఫిల్మ్ మేకర్స్ను కోరుతున్నారు. మరోవైపు, ఆమె అభిమానులు సైతం ఈ సందర్భంలో ఆమె చూపిన సానుభూతి తగదని పేర్కొంటూ, “ఇలాంటి సమయాల్లో దేశ పౌరులంతా ఐక్యంగా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలు దేశ భద్రతను దెబ్బతీయకూడదు” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు యుద్ధం పరిష్కారం కాదన్న భావనను సమర్థించాలన్నా, మరోవైపు పాకిస్తాన్ మద్దతుతో ఇండియాపై ఉగ్రదాడులు జరుపుతున్న వాస్తవాలను విస్మరించడం సమంజసం కాదన్నది నెటిజన్ల స్థిర అభిప్రాయం.
Recent Random Post: