టాలీవుడ్లో రీసెంట్గా రీ-రిలీజ్లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. కొత్త సినిమాలు పక్కనపెడితే, పాత హిట్ చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఫ్యాన్స్కు ఇది ఒక పండుగలా ఉంటే, నిర్మాతలకైతే లాభదాయకమైన దారి అయ్యింది. ఇక ఇప్పుడు మిగతా సినిమాలకన్నా ప్రత్యేకమైన హైప్ ఉన్న ఓ లెజెండరీ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
అదే మెగాస్టార్ చిరంజీవి మరియు లెజెండరీ నటి శ్రీదేవి కలిసి నటించిన క్లాసిక్ సినిమా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. ఈ చిత్రానికి ఇప్పుడు 35 ఏళ్ల పూర్తి కావడంతో మేకర్స్ గ్రాండ్ రీ రిలీజ్కు రెడీ అయ్యారు. మే 9న 2D మరియు 3D వర్షన్లలో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, మరియు నిర్మాత అశ్వినీదత్ కలిసి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా, ఈ సినిమాకు సీక్వెల్ తీసే యోచనపై ఆసక్తికర చర్చ జరిగింది.
క్లైమాక్స్ ఆధారంగా సీక్వెల్కు అవకాశముంది – శ్రీదేవి వేసిన ఉంగరం సముద్రంలో పడిపోయి చేప మింగేసిన సీన్ ఆధారంగా కథను కొనసాగించే వీలు ఉంది. ఇందుకోసం రామ్ చరణ్–జాన్వీ కపూర్ జోడిగా నటించాలన్న ఆలోచనకు అశ్వినీదత్ ట్రై చేసినట్లు చెప్పారు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీదేవి స్థాయిలో నటన ఇవ్వడం జాన్వీ వల్ల కాదనే కామెంట్లు కూడా వచ్చాయి.
డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా అదే అభిప్రాయాన్ని పంచుకున్నారు – “శ్రీదేవికి మరో ప్రత్యామ్నాయం ఉండదు. అలాగే ఇళయరాజా సాంగ్స్ మళ్లీ ఆ మేజిక్ ను పునరావృతం చేయడం కష్టం.” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్కు ఇకనైనా గుడ్బై చెప్పడం బెటర్ అనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.
Recent Random Post: