
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ అంతగా కలిసివచ్చిందా? అనుకుంటే, సమాధానం పెద్దగా సంతృప్తికరంగా ఉండదు. సీనియర్ హీరోల నుంచి ప్రస్తుత తరం వరకు చాలామంది హిందీ సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎవరూ అక్కడ స్థిరపడలేకపోయారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్స్లో ఉండగానే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆజ్ కా గుండా రాజ్ (1992) ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మరో హిందీ సినిమా చేయకుండా పూర్తిగా తెలుగు పైనే దృష్టి సారించారు. కింగ్ నాగార్జున మాత్రం శివ ద్వారా హిందీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, తర్వాత చేసిన క్రిమినల్, ఖుడా గావ్, ద్రోహి వంటి చిత్రాలు ఆయనను బాలీవుడ్ స్టార్గా నిలబెట్టలేకపోయాయి. రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత నాగ్ బ్రహ్మాస్త్రలో కీలక పాత్ర పోషించారు.
నటసింహ బాలకృష్ణ అయితే హిందీ సినిమాల జోలికే వెళ్లలేదు. విక్టరీ వెంకటేష్ మాత్రం 1993లో అనారితో మంచి ప్రారంభం చేశారు. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులలో నటించారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్లో గెస్ట్ రోల్లో కూడా కనపడ్డారు. అయినా స్టార్డమ్ మాత్రం తెలుగు వరకే పరిమితమైంది.
తర్వాత తరం హీరోల విషయంలో కూడా పరిస్థితి అంతే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ రీమేక్ (తుపాన్)తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా, అంచనాలు అందుకోలేకపోయారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహోతో హిందీ మార్కెట్ని టార్గెట్ చేసినా, ఫలితం సగటుగా మిగిలిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించలేకపోయింది.
మొత్తం చూసుకుంటే, టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్లో మంచి లాంచింగ్ సాధించినా, పెద్ద స్టార్డమ్ను కైవసం చేసుకోలేకపోయారు. అయినా రాబోయే రోజుల్లో మరికొంత మంది తెలుగు హీరోలు హిందీలో అదృష్టాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
Recent Random Post:















