మంచు మనోజ్ ఒకప్పుడు ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉండేవాడు. తనకంటూ ఓ ప్రత్యేక మాస్ ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అయితే సరైన కమర్షియల్ హిట్ లేకపోవడంతో వరుస ఫ్లాప్స్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్కి గట్టి ప్లాన్తో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఇటీవల ‘భైరవం’ సినిమాతో మళ్లీ మెడిల్లోకి వచ్చిన మనోజ్, త్వరలోనే ‘మిరాయ్’లో విలన్గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే, గతంలో ప్రకటించిన ‘వాట్ ద ఫిష్’, ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. వాటి గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు.
ఇప్పుడు ‘భైరవం’ చిత్రంతో మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్కి నమ్మకంగా అడుగుపెట్టాడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించగా, ఇది ఓ మినీ మల్టీస్టారర్గా రూపొందింది. మొదట ఈ సినిమాను మనోజ్ తన అన్న విష్ణు మంచు నటించిన ‘కన్నప్ప’కు పోటీగా ఏప్రిల్ 25న విడుదల చేయాలని భావించినట్లు సమాచారం. కానీ ‘కన్నప్ప’ రిలీజ్ జూన్ 27కి వాయిదా పడటంతో, ‘భైరవం’ రిలీజ్ కూడా వాయిదా పడింది.
ఇక తాజాగా మనోజ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘90 ఎం.ఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ వింటేనే ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
Recent Random Post: