శ్రీనిధి శెట్టి: కష్టాలు, విజయాలు, మరియు కొత్త ప్రయాణం

Share


మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి శెట్టి, ఆ త‌ర్వాత హీరోయిన్‌గా మారింది. కానీ ఈ మార్గంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె, కెరీర్‌లో ఎదగడానికి చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. తన జ‌ర్నీలో ఉన్న బాధ‌లను అధిగ‌మించి ఈ స్థాయికి చేరినట్లు చెప్పిన శ్రీనిధి, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లింద‌ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది.

శ్రీనిధి చెప్పినట్టు, టెన్త్ క్లాస్‌లో చదువుతున్నప్పుడు త‌న త‌ల్లి చ‌నిపోయింది. ఆ షాక్‌ను త‌ట్టుకోలేక కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఇంట్లో ఉండాలనిపించ‌లేదని చెప్పింది. గ‌తాన్ని మ‌ర్చిపోయేందుకు బెంగుళూరుకు వెళ్లినప్పటికీ త‌న త‌ల్లిని మర్చిపోలేకపోయానని, ఆమెను తలుచుకుంటూ చాలా రోజులు ఏడ్చానని చెప్పింది. ఈ విషాదం నుంచి బయటపడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. కానీ త‌ల్లి చ‌నిపోయాక, తండ్రి ఎంతో స‌పోర్ట్‌గా నిలిచారని శ్రీనిధి పేర్కొంది.

బెంగుళూరుతో తన అనుబంధాన్ని వివరిస్తూ, అక్కడే తన జీవితం పూర్తిగా మారిపోయిందని, జైన్ యూనివ‌ర్సిటీలో బీటెక్ చేసిన తరువాత కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసినట్లు చెప్పింది. మోడలింగ్‌లో ఆసక్తి ఉండటం వల్ల ఆ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనిధి, 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన ఆమె, పాన్ ఇండియన్ సినిమాల్లో నటించి, పెద్ద క్రేజ్ సంపాదించింది.

కెజి‌ఎఫ్‌తో హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన శ్రీనిధి, కెజి‌ఎఫ్ 2తో మరింత పాపులర్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నా, స్టార్‌డ‌మ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత, తమిళంలో “విక్ర‌మ్” సినిమా చేసి, “కోబ్రా” సినిమాలో కూడా నటించింది, కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

రీసెంట్‌గా నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వచ్చిన “హిట్3” సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి, ఆ సినిమా విజయం సాధించి, స్టార్‌డ‌మ్‌ను కూడా అందుకుంది. ప్ర‌స్తుతం, సిద్దు జొన్న‌ల‌గడ్డ హీరోగా నటిస్తున్న “తెలుసు క‌దా” సినిమాలో నటిస్తోంది. ఇంకా, కిచ్చ సుదీప్‌తో ఒక కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది.


Recent Random Post: