
కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న చందూ మొండేటి, ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘తండేల్’ అనే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. చందూ మొండేటి, నాగ చైతన్య మధ్య ఆల్రిడి “ప్రేమమ్” మరియు “సవ్యసాచి” వంటి సినిమాలు చేయగా, సాయి పల్లవి కూడా “అమరన్” తర్వాత ఈ సినిమాతో నటిస్తున్నారు.
గతంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా వచ్చిన “లవ్ స్టోరీ” సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. “తండేల్” సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చందూ మొండేటి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన మైండ్లో ఈ కథ ఎలా వచ్చినదో వివరించిన చందూ, సవ్యసాచి సినిమా తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఆరంభమైందని చెప్పారు.
తండేల్ స్టోరీ డాక్యుమెంటరీ ఫీలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ఐడియాను కొద్దిగా మార్పులు చేయడం ద్వారా ఈ సినిమాను రూపొందించామన్నారు. పాకిస్తాన్కు సంబంధించిన సీన్స్ సినిమాలో వేరే భాగంగా ఉంటాయని, కానీ మొత్తం కథ దేశభక్తి, ప్రేమతో కూడిన కథ అని చెప్పిన చందూ, ఈ సినిమా కోసం చైతన్య మరొక స్థాయిలో పనిచేశాడని కొనియాడారు.
చందూ మొండేటి ఇప్పటికే కోలీవుడ్ స్టార్ సూర్యతో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్లు తెలిపారు. “తండేల్” సినిమాను పూర్తి చేసాక సూర్యతో చేస్తున్న సినిమా గురించి త్వరలో అప్డేట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
Recent Random Post:














