బిజ్జల అంటూ సజ్జలపై రఘురామ ఫైర్

వైఎస్సార్ సీపీలోనే ఉంటూ పార్టీపైనా.. సీఎం జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏయ్ సజ్జలా ఎవడ్రా నువ్వు.. రాస్కెల్ అంటూ మండిపడ్డారు. బుద్ధి తెచ్చుకో.. పిచ్చిపిచ్చి వేషాలు వేయకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టడం కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మనుషులను నియమించారని ఆరోపించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామ.. అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఖాళీగా లేనని.. తన మనుషులు కూడా నీ దగ్గర ఉన్నారంటూ సజ్జలను, సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సజ్జల.. సారీ బిజ్జల దిశానిర్దేశంతో తనను అసహనానికి గురిచేసి కేసులు వేయాలని భావిస్తున్నట్టు తనవాళ్లు చెప్పారని వెల్లడించారు. ‘నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది.. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతాను. నన్ను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పాను. ఏయ్ సజ్జలా.. ఎవడ్రా నువ్వు.. ఆఫ్ట్రాల్ నువ్వో జర్నలిస్టు. డీఫ్యాక్టో హోంమంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ చేస్తున్నావు. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా? నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నేను చెప్పేది నేను చెబుతా. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, జగన్ మీ పరిధితుల్లో ఉండండి’ అంటూ ఫైర్ అయ్యారు. జగన్ కు పిచ్చి ఉందని.. అది తగ్గే వరకు సీఎం బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలని డిమాండ్ చేశారు.


Recent Random Post: