బద్వేలు వైకాపా అభ్యర్థి దాసరి సుధ

బద్వేలు వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడటంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానంకు ఎన్నిక నిర్వహించేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ స్థానం నుండి అధికార పార్టీ ఎవరిని పోటీకి దించితే వారే విజేతలు అవ్వడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకుల బలంగా చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఆ స్థానంలో పోటీ చేయబోతున్న తమ అభ్యర్థిని వైకాపా ప్రకటించింది.

బద్వేలు ఉప ఎన్నికల విషయమై సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకే సీటు ఇవ్వడం మా పార్టీ సాంప్రదాయం. అందుకే వెంకట సుబయ్య భార్య సుధ గారికి సీటు ఇవ్వబోతున్నాం. ఈ ఎన్నికలను వైకాపా సీరియస్ గా తీసుకుంటుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. పోటీని ఎంత సీరియస్ గా తీసుకోవాలో అంత సీరియస్ గా తీసుకుని మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని సజ్జల పేర్కొన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది ఖచ్చితంగా సుధ గారిని గెలిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు.


Recent Random Post: