రంగమ్మత్త ఇక అక్కడ కూడా సత్తాచాటుతుందట

యాంకర్గా తన ప్రాస్థానాన్ని ప్రారంభించింది అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ ఆ తరువాత వరుస టీవీ షోల్లో కనిపిస్తూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇండస్ట్రీ వర్గాలకు చేరువైంది. ఆ తరువాత అనూహ్యంగా వెండితెరపై మెరిసి తన దైన పాత్రల్లో మెస్మరైజ్ చేయడం మొదలుపెట్టింది. ఏ.ఎం. రత్నం నిర్మించిన `నాగ` సినిమాతో అనసూయ నటిగా తన కెరీర్ ప్రారంభించినా ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు లభించలేదు.

ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా క్షణం చిత్రాలు కొంత ఊరట కలిగించినా నటిగా మాత్రం అనసూయకు గుర్తింపుని తెచ్చిపెట్టింది మాత్రం `రంగస్థలం` సినిమానే. ఇందులో రంగమ్మత్తగా అనసూయ నటించిన తీరు ప్రశంసలు కురిపించడంతో పాటు ఆమెకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుంచి విభిన్నమైన పాత్రలకు అనసూయ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

ఇటీవల అల్లు అర్జున్ నటించిన `పుష్ప`లో రఫ్ గా కనిపించే దాక్షాయణి పాత్రలో కనిపించి షాకిచ్చింది. ఈ సినిమాతో పాటు వరుసగా క్రేజీ స్టార్ల చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న అనసూయ ఇదే ఏడాది మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రటిస్తున్న చిత్రం `భీష్మ పర్వం`. అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా అనసూయ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.

ఇందులలో అనసూయ ఎలైస్ పాత్రలో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతోంది. ఇందుకు సంబంధించిన అనసూయ లుక్ ని బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. డీ గ్లామర్ లుక్ లో బ్లాక్ గాగుల్స్ ధరించి సాధారణ గృహిణిగా అనసూయ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. నదియా అంజలి ఫాహద్ ఫాజిల్ దిలేష్ పోతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో అక్కడ కూడా రంగమ్మత్త తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.


Recent Random Post: