తప్పుడు కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం : బాబు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా చింతలపూడి లోని తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను కలిశారు. ఇటీవలే నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయ్యి ఇటీవలే విడుదల అయ్యాడు. ఆయన్ను కలిసేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు తప్పుడు కేసులు పెడుతున్న అధికారులను మర్చిపోమని హెచ్చరించాడు.

తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ద్వారా వారి అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధూళిపాళ్లకు తెలుగు దేశం పార్టీ అండగా నిలుస్తుంది. ఆయన కేసుల్లో పోరాడి గెలుస్తాడని నమ్మకం వ్యక్తం చేశాడు. అలాగే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు కూడా నరేంద్రకు మద్దతుగా నిలవాలంటూ సూచించాడు. ఇప్పుడు అత్యుత్సాహం చూపిస్తున్న ఏ ఒక్క అధికారిని కూడా మర్చి పోమని.. ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు అన్నారు. వైకాపా నాయకులు రాష్ట్రంను రాయలసీమ ఫ్యాక్షన్‌ రాజకీయాలుగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.


Recent Random Post: