తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొస్తా.. విజయం సాధిస్తా: చంద్రబాబు

తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని.. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తి సామర్ధ్యాలు, ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. ప్రజలందరి నమ్మకానికి తగ్గట్టు పని చేస్తానని.. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

మరోవైపు.. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కేక కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తిరుమల అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ రాష్ట్ర సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టి, 720 గ్రాముల కర్పూరం వెలిగించారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత కార్యకర్తలు 1,116 కొబ్బరికాయలు కొట్టారు.


Recent Random Post: