దేవుడి ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారు: హైదరాబాద్ మేయర్ బొంతు

తెలంగాణ సీఎంగా కేటీఆర్ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఒకొక్కరు ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు కేటీఆర్ సీఎం కావడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మేయర్ బొంతు రామ్మోహన్ వంతు వచ్చింది. ‘దేవుడి ఆశీస్సులతో కేటీఆర్ సీఎం అవుతారు. సమయం సందర్భం రావాలి. ఎప్పుడు ఏం జరగాలనేదానిపై సీఎం కేసీఆర్, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యేల ఆమోదంతో కేటీఆర్ సీఎం అవుతారు’ అని అన్నారు.

మంగళవారం సతీసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు రామ్మోహన్. దర్శనానంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కేటీఆర్ సీఎం అనే వార్తల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోపాటు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్టు బొంతు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కు మరింత శక్తినివ్వాల్ని కోరుకున్నానన్నారు.


Recent Random Post: