ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో భేటీ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ పదవి కోసం తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలో పీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ ఎంపిక చేయనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తో సమావేశం కానున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఢిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆయనకే పదవి కట్టబెట్టాలని కొందరు కోరుతున్నారు. మరోవైపు.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా చూసేందుకు మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.


Recent Random Post: